
బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో రాణించిన ఛతేశ్వర పూజారా, రవిచంద్రన్ అశ్విన్లను అరుదైన ఘనత ఊరిస్తోంది. డిసెంబర్ 22 నుంచి మిర్ పుర్లోని షేర్ ఈ బంగ్లా జాతీయ స్టేడియంలో భారత్ బంగ్లాల మధ్య రెండో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో పూజారా, అశ్విన్ అరుదైన మైలురాళ్లను అందుకోనున్నారు. రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం టీమిండియా తరపున 87 టెస్టుల్లో 2.989 పరుగులు చేశాడు. అయితే మరో 11 పరుగులు చేస్తే అతను టెస్టుల్లో 3వేల పరుగులు చేసిన బ్యాట్స్మన్గా అవతరిస్తాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో 400 పైగా వికెట్లు, 3వేల పరుగులు చేసిన కపిల్ దేవ్, షేన్ వార్న్, రిచర్డ్ హ్యాడ్లీ, షాన్ పొలాన్ సరసన అశ్విన్ చేరనున్నాడు. అంతేకాకుండా మరో 7 వికెట్లు తీస్తే..టెస్టు్ల్లో అత్యంత వేగంగా 450 వికెట్లు తీసిన భారత బౌలర్గా నూ , ఇంటర్నేషనల్ క్రికెట్ లో రెండో ఆటగాడిగానూ చరిత్రకెక్కుతాడు. భారత్ తరపున ఈ రికార్డు కుంబ్లే (93వ మ్యాచ్ల్లో) పేరిట ఉంది. ఓవరాల్ గా శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ 80 టెస్టుల్లోనే సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు.
మరోవైపు తొలి టెస్టులో రాణించి విజయానికి కారణమైన ఛతేశ్వర పూజారా...రెండో టెస్టులో ఓ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఈ టెస్టులో అతను మరో 16 పరుగులు చేస్తే..టెస్టుల్లో 8వేల పరుగులు చేసిన ఎనిమిదవ బ్యాట్స్ మన్ గా రికార్డు నెలకొల్పుతాడు. గతంలో ఈ రికార్డు సచిన్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గావస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేందర్ సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, సౌరభ్ గంగూలీ 8వేల పరుగులు సాధించారు.