
చట్టోగ్రామ్: బంగ్లాదేశ్తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్ట్లో ఇండియా తడబడి కోలుకుంది. చతేశ్వర్ పుజారా (203 బాల్స్లో 11 ఫోర్లతో 90) సెంచరీ మిస్ అయినా... శ్రేయస్ అయ్యర్ (82 బ్యాటింగ్) నిలకడగా ఆడటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 278/6 స్కోరు చేసింది. ఫ్లాట్ వికెట్పై టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇండియాకు సరైన ఆరంభం దక్కలేదు. 14వ ఓవర్లో శుభ్మన్ గిల్ (20) ఔటైతే.. మరో ఐదు ఓవర్ల తర్వాత స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (3/84) డబుల్ మ్యాజిక్ చేశాడు. వరుస ఓవర్లలో కేఎల్ రాహుల్ (22), విరాట్ కోహ్లీ (1)ని పెవిలియన్కు పంపడంతో ఇండియా 48 రన్స్కే 3 వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో పుజారా డిఫెన్స్కు ప్రాధాన్యమిస్తే, రిషబ్ పంత్ (46) కౌంటర్ అటాక్తో బంగ్లా బౌలర్ల కాన్ఫిడెన్స్ను దెబ్బతీశాడు. ఈ క్రమంలో నాలుగో వికెట్కు 64 రన్స్ జత చేసి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. కానీ ఆఫ్ స్పిన్నర్ మిరాజ్ (2/71) బౌలింగ్లో ఫుల్ లెంగ్త్ బాల్ను బ్యాక్ఫుట్ ఆడే క్రమంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో వచ్చిన శ్రేయస్ అయ్యర్.. పుజారాకు మంచి సమన్వయాన్ని అందించాడు. పుజారా 125 బాల్స్లో, శ్రేయస్ 93 బాల్స్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. కానీ చివరి సెషన్లో కొత్త బంతితో బంగ్లా బౌలర్లు మళ్లీ పుంజుకున్నారు. సెంచరీ దిశగా సాగుతున్న పుజారాను తైజుల్ ఇస్లామ్ బౌల్డ్ చేశాడు. ఐదో వికెట్కు 149 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. డే చివరి బాల్కు అక్షర్ పటేల్ (14) ఔటయ్యాడు.