ఇటీవల ‘బేబి’ చిత్రంతో ఆకట్టుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ హీరోయిన్. అను ప్రసాద్ దర్శకత్వంలో నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ టీజర్లాంచ్ ఈవెంట్ జరిగింది. నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, దర్శకుడు కష్ణ చైతన్య అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. టీజర్ విషయానికొస్తే.. ఇదొక యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.
ట్రెండీ లుక్లో కనిపిస్తున్న విరాజ్, పూజిత కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ప్రేమ కంటే కెరీర్పైనే యువత ఫోకస్ పెట్టాలనే మెసేజ్ ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. ‘ఆనందానికి ఆవేశం ఎక్కువ.. వెంటనే బయటపడిపోతుంది. కానీ బాధకు బాధ్యత ఎక్కువ. ఎప్పుడు లోపలే ఉండిపోతుంది’ అని సాయి కుమార్ చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. బ్రహ్మాజీ, మధు నందన్ ఇతర పాత్రల్లో కనిపించారు. యూత్ను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని దర్శకుడు అను ప్రసాద్ చెప్పాడు.