మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి మహిళపై కత్తితో దాడి చేశాడు. నిందితుడు కత్తి పట్టుకుని మహిళపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండగా...అతని నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు పరిగెడుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఏం జరిగిందంటే..
పూణెలోని సదాశివపేట ప్రాంతంలో ఎంపీఎస్సీ విద్యార్థినిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. 20 ఏళ్ల ప్రీతి రామచంద్ర అనే విద్యార్థిని మరో అబ్బాయితో కలిసి స్కూటీపై వెళ్తోంది. ఇంతలో శంతను లక్ష్మణ్ జాదవ్ అనే యువకుడు స్కూటీని ఆపి అతనిపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ప్రీతి రామచంద్రపై కూడా దాడి చేయాలని చూశాడు. అయితే ఆమె పరుగెత్తింది. లక్ష్మణ్ జాదవ్ కూడా యువతి వెంట పరుగెత్తాడు. కొద్ది దూరం వెళ్లాక ప్రీతిపై లక్ష్మణ్ జాదవ్ కత్తితో దాడి చేశాడు. స్థానికులు అతన్ని వారించేందుకు ప్రయత్నించినా..ఆపలేదు. పైగా స్థానికులపై కూడా నిందితుడి దాడి చేయడానికి ట్రై చేశాడు. ఈ దాడిలో ప్రీతికి గాయాలయ్యాయి.
ప్రీతి రామచంద్రపై దాడి చేసిన లక్ష్మణ్ జాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా రోజులుగా విద్యార్థిని యువకుడు వేధిస్తున్నారని పోలీసులు చెప్పారు. దీనిపై యువతి తల్లి నిందితుడి తండ్రికి ఫిర్యాదు చేసినా మారలేదు.