బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ పార్థివ దేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. పునీత్ భౌతిక కాయానికి నివాళి అర్పించిన బొమ్మై.. శనివారం జరగాల్సిన అంత్యక్రియలను ఆదివారానికి వాయిదా వేశామన్నారు. పునీత్ కూతురు న్యూయార్క్ నుంచి రావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కాగా, పునీత్ను చివరిసారి చూడటానికి వేల సంఖ్యలో ఫ్యాన్స్తోపాటు సెలబ్రిటీలు కంఠీరవ స్టేడియానికి క్యూ కట్టారు. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, నరేశ్, ప్రభుదేవా, శివాజీలు పునీత్కు నివాళి అర్పించారు. పునీత్ పార్థివ దేహాన్ని చూసి బాలయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. కర్నాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లోత్ కూడా పునీత్కు నివాళి అర్పించారు.
Actor @tarak9999 paying his respects to #PuneethRajukumar. He is seen along with @NimmaShivanna. Telugu film industry had a strong bond with #Puneeth and the untimely death of the #PowerStarPuneethRajkumar shocked the industry. pic.twitter.com/mG5gXmD6to
— dinesh akula (@dineshakula) October 30, 2021