పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మూడోసారి తండ్రైయాడు. ఈరోజు ఆయన రెండవ భార్య డా.గురుప్రీత్ కౌర్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భగవత్ మాన్ ఎక్స్ వేదికగా తన అధికారిక ఖాతాలో పంచుకున్నారు. భగవంతుడు తనకు కుతురిని ప్రసాదించాడని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు. భగవంత్ మాన్ మెదటి భార్యతో మనస్పర్ధలు రావడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2015లో విడాకులు తీసుకున్నారు. అప్పటికే వారికి ఇద్దరు పిల్లలున్నారు. 2022లో గురుప్రీత్ కౌర్ ను రెండవ విహవాం చేసుకున్నారు.
జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల్లో భగవంత్ మాన్ తన భార్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ప్రకటించారు. లూథియానాలో జరిగిన సభలో ప్రసంగిస్తూ.. తన భార్య గురుప్రీత్ ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి అని.. మార్చిలో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు.