
పంజాబ్లోని మోగాకు చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి మానసికంగా అస్వస్థతకు గురై, కొన్ని వస్తువులను మింగేశాడని, వాటిని ఆపరేషన్ చేసి తొలగించినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ క్రమంలో అతని కడుపు నుంచి షాకింగ్ వస్తువులను కనుగొన్నారు. ఆ వ్యక్తి తీవ్రమైన, దీర్ఘకాలిక కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చినట్టు వైద్యులు తెలిపారు.
షాకింగ్ విజువల్స్
అతడికి మూడు గంటల పాటు వైద్య నిపుణులు ఆపరేషన్ చేసి.. అతని కడుపు నుంచి ఇయర్ఫోన్లు, లాకెట్లు, స్క్రూలు, రాఖీలు వంటి వస్తువులను బయటకు తీశారు. అతని కడుపు నుండి తీసివేసిన వస్తువుల జాబితాను చూపించే ఆపరేషన్ కు సంభందించిన దృశ్యాలు ఆన్లైన్లో కనిపించాయి. వీటిలో సేఫ్టీ పిన్స్, షర్ట్ బటన్లు, జిప్లు తొలగించబడిన అనేక వస్తువులలో ఉన్నాయి.
రోగి రెండేళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడని, జ్వరం, వాంతులు వంటి లక్షణాలతో సెప్టెంబర్ 21న అడ్మిట్ అయ్యాడని తెలిపారు. ప్రారంభంలో, అతని కడుపులో ఉన్న స్క్రూలు, నట్స్, బోల్ట్లు, ఇయర్ఫోన్లు, మాగ్నెట్లతో సహా అనేక వస్తువులుండడం చూసి ఆరోగ్య సంరక్షణ వైద్యులు షాక్కు గురయ్యారు.
ఆసుపత్రిలో నమోదైన మొదటి వింత కేసు ఇదే. అయితే వైద్యులు ఆ వ్యక్తికి విజయవంతంగా చికిత్స అందించి, రక్షించారు. పలు వార్తా నివేదికల ప్రకారం, వివిధ వస్తువులను మింగిన వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని అతని కుటుంబం తెలిపింది.
40 ਸਾਲ ਦੇ ਵਿਅਕਤੀ ਦੇ ਢਿੱਡ 'ਚੋਂ ਨਿਕਲੀਆਂ ਅਹਿਜਿਆਂ ਚੀਜ਼ਾਂ ਜਿਨ੍ਹਾਂ ਨੂੰ ਦੇਖ ਸਬ ਦੇ ਉੱਡੇ ਹੋਸ਼ #moga #hospital #viralnews #viralposts #LatestNews #shortsvideos #PunjabNews #punjabnewstv pic.twitter.com/d1ZgRphLcN
— Punjab News tv (@5aabNewstv) September 27, 2023