
హైదరాబాద్, వెలుగు: నాంపల్లి స్టేషన్ రోడ్డు దగ్గర ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) బ్రాంచ్ అబిడ్స్లోని చిరాక్ అలీ లేన్కు షిఫ్ట్ అయ్యింది. కస్టమర్ల సౌకర్యార్ధం బ్రాంచ్ను షిఫ్ట్ చేశామని పీఎన్బీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. అబిడ్స్లోని బ్రాంచ్ను హైదరాబాద్ బ్యాంక్ జోనల్ హెడ్ దీపక్ కుమార్ శ్రీవాస్తవ ప్రారంభించారు. సర్కిల్ హెడ్ ఎన్వీఎస్పీ రెడ్డి, నాంపల్లి బ్రాంచ్ మేనేజర్ మయూర్ గండమ్వార్, ఇతర సీనియర్ ఉద్యోగులు పాల్గొన్నారు.
కస్టమర్లు బ్యాంక్ బిజినెస్ను సపోర్ట్ చేయాలని దీపక్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పీఎన్బీవన్ యాప్ ద్వారా ఆన్లైన్ సర్వీస్లను వాడుకోవాలని సూచించారు. ఈ యాప్ ద్వారా ఎఫ్డీలు లేదా ఆర్డీలను ఓపెన్ చేసుకోవచ్చని, యూపీఐ, స్కాన్ అండ్ పే వంటి సర్వీస్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్లు కూడా పొందొచ్చని వెల్లడించారు. కొత్త బ్రాంచ్ను ఓపెన్ చేసిన సందర్భంగా మంజూరు చేసిన రూ.2.20 కోట్ల రిటైల్ లోన్లను కూడా బ్యాంక్ ఉద్యోగులు డిస్ట్రిబ్యూట్ చేశారు.