ఏం టాలెంట్ బాసూ : బైక్ స్టంట్స్ చేసినట్లు.. ట్రాక్టర్ తో వండర్స్ చేసిన రైతు

ఏం టాలెంట్ బాసూ : బైక్ స్టంట్స్ చేసినట్లు.. ట్రాక్టర్ తో వండర్స్ చేసిన రైతు

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో గ్రామీణ క్రీడా ప్రదర్శనలో ట్రాక్టర్‌పై విన్యాసాలు చేస్తూ ఓ వ్యక్తి నుజ్జునుజ్జడయ్యాడు. ఈ ఘటనను అక్కడి స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ అయింది. దీంతో తాజాగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫతేఘర్ చురియన్ నియోజకవర్గం పరిధిలోని సర్చూర్ గ్రామంలో బాధితుడు సుఖ్‌మన్‌దీప్ సింగ్ (29) అక్టోబర్ 28న మృతి చెందాడు.

Also Read :- కేరళ పేలుళ్లతో ఢిల్లీలో హై అలర్ట్

ఈ వీడియోలో  సింగ్ తన పాదాలను టైర్‌పై ఉంచి ట్రాక్టర్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నాడు. వాహనంపైకి ఎక్కేందుకు ప్రయత్నించగా కాళ్లు బురదలో కూరుకుపోయి కిందపడిపోయాడు. అనంతరం ట్రాక్టర్ టైర్ల కింద నలిగిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో.. నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.