సెప్టెంబర్​లో పంజాబ్ టూరిజం సమిట్

సెప్టెంబర్​లో పంజాబ్ టూరిజం సమిట్

హైదరాబాద్, వెలుగు: తమ రాష్ట్రాన్ని ప్రధాన పర్యాటక ప్రాంతంగా నిలపాలన్న ఉద్దేశంతో వచ్చే నెల 11 నుంచి 13వ తేదీ వరకు మొహాలీలో టూరిజం సమ్మిట్ అండ్ ట్రావెల్ మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించనున్నట్లు పంజాబ్ పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి అన్మోల్ గగన్ మాన్ తెలిపారు. 

హైదరాబాద్‌‌లో శుక్రవారం నిర్వహించిన 'పంజాబ్ టూరిజం రోడ్​ షో' సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఈవెంట్ పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా నిలుపుతుందన్నారు.  విదేశీ, దేశీయ టూర్ ఆపరేటర్లు, డీఎంసీలు, డీఎంవోలు, ట్రావెల్ ట్రేడ్ మీడియా, ట్రావెల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, హోటల్ ఆపరేటర్లు, బీ&బీ, ఫామ్ స్టే ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, టూరిజం బోర్డులు సమిట్​లో పాల్గొననున్నాయని తెలిపారు.