తిరుమలలో ఇవాళ ఆర్జిత సేవలు రద్దు

తిరుమలలో ఇవాళ ఆర్జిత సేవలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ పుష్పయాగం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం కొనసాగనుంది. పుష్పయాగం కారణంగా శ్రీవారి ఆలయంలో అష్టాదళ పాదపద్వారాధన, కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. 

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి సర్వదర్శనానికి 16గంటల సమయం పడుతోంది. దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 70 వేల 560 మంది భక్తులు దర్శించుకున్నారు. 29 వేల 751మంది తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండీ ఆదాయం 4 కోట్ల 18 లక్షలు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.