అస్థానా(కజకిస్తాన్): ఉక్రెయిన్తో యుద్ధాన్ని వీలైనంత తొందరగా ముగించేస్తామని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ఈమేరకు ఆయన శుక్రవారం కజకిస్తాన్ రాజధాని అస్థానాలో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్పై ఇక భారీ దాడులు చేయాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు. ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలనేది తమ అభిమతం కాదని పుతిన్ తేల్చిచెప్పారు. రష్యా–ఉక్రెయిన్ల మధ్య శాంతి చర్చలు జరగాలని ఇండియా, చైనాలు చాలా ప్రయత్నించాయని పుతిన్ పేర్కొన్నారు.
యుద్ధాన్ని ఆపడానికి ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నాన్ని పుతిన్ గుర్తుచేసుకున్నారు. యుద్ధంపై పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారనీ చెప్పుకొచ్చారు. కిందటి నెలలో జరిగిన షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీవో) సమిట్ సందర్భంగా మోడీతో మాటల మధ్య ఉక్రెయిన్ యుద్ధం చర్చకొచ్చిందని తెలిపారు. ఆ రెండు దేశాల కన్సర్న్ను రష్యా గుర్తించిందని, వీలైనంత తొందరగా యుద్ధాన్ని ముగిస్తామని పుతిన్ వివరించారు.