టీడీపీకి షాక్.. : వైసీపీలో చేరిన పుట్టపర్తి టీడీపీ ఇంచార్జి వేణుగోపాల్

టీడీపీకి షాక్.. : వైసీపీలో చేరిన పుట్టపర్తి టీడీపీ ఇంచార్జి వేణుగోపాల్

అనంతపురం జిల్లాలో  టీడీపీకి షాక్ తగిలింది.   కీలక నేతలు  సైకిల్​ దిగి ఫ్యాన్​ కింద సేద తీరుతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గ కీలక నేతలు వేణుగోపాల్​, కె పెద్దన్న, వెంకటస్వామి, తిరుపతేంద్ర (జనసేన) సీఎం జగన్​ సమక్షంలో వైసీపీలో చేరారు.  వారిని సీఎం జగన్​ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు

.  చంద్రబాబు పుట్టపర్తి టికెట్​ ఇస్తానని..తనకు వెన్నుపోటు పొడిచారని వేణుగోపాల్‌ ఆరోపించారు.  డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత పుట్టపర్తి టికెట్​ రఘునాథరెడ్డి కోడలికి కేటాయించారని తెలిపారు.  అనంతపురం జిల్లా పుట్టపర్తి  టీడీపీ నేతలు ... పచ్చ పార్టీకి  గుడ్ బై చెప్పారు. పార్టీలో మైనార్టీలకు అవమానాలు తప్ప అధికారాలు లేవంటూ ఆయన ఆరోపించారు. టికెట్​  ఇస్తానని మాట తప్పిన చంద్రబాబుతో ఇక కలిసి పని చేయలేమని ఆయన అన్నారు.పుట్టపర్తిలో తనకు టికెట్ ఇవ్వలేదని వేణుగోపాల్​  వాపోయారు. 

also read : ఏపీలో మహిళా వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు