Singapore Open 2024: ప్రీ-క్వార్టర్స్ లోనే ఇంటిదారి.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన సింధు

Singapore Open 2024: ప్రీ-క్వార్టర్స్ లోనే ఇంటిదారి.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన సింధు

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సింగపూర్ ఓపెన్‌లో ఓడిపోయింది. చిరకాల ప్రత్యర్థి కరోలినా మారిన్‌పై తన పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. గురువారం (మే 30) అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో 21-13 11-21 20-22 తేడాతో మారిన్ పై సింధు ఓడిపోయింది. దీంతో సింగపూర్ ఓపెన్ లో సింధు ప్రీ క్వార్టర్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

తొలి సెట్ ను 21-13 తో ఈజీగానే గెలిచిన సింధు.. రెండో సెట్ లో ఆ జోరు చూపించలేకపోయింది. మారిన్ విజృంభించడంతో సెట్ 11-21 తో సెట్ ను కోల్పోయింది. చెరో సెట్ గెలిచిన తర్వాత నిర్ణయాత్మకమైన మూడో సెట్ లో ఇద్దరూ పోటాపోటీగా పోరాడారు. అయితే కీలక దశలో పుంజుకున్న సింధ్ 18-15 ఆధిక్యంలోకి వెళ్ళింది. అయితే ఈ దశలో మారిన్ ఒక్కసారిగా చెలరేగింది. వరుస పాయింట్లతో సెట్ ను 22-20తో ముగించింది. 

మారిన్ చేతిలో సింధుకి వరుసగా ఇది ఆరో ఓటమి. కాగా.. ఆదివారం (మే 26) జరిగిన మలేషియా మాస్టర్స్ ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ జి యి చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో సింధు పరాజయం పాలైంది. దీంతో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత రన్నరప్‌తో సరిపెట్టుకుంది.