ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఢిల్లీలో కలుసుకున్నారు BWF వరల్డ్ ఛాంపియన్ షిప్ విజేత పీవీ సింధు. ప్రధానమంత్రి కార్యాలయంలో మోడీని … కోచ్ పుల్లెల గోపీచంద్, తన కుటుంబసభ్యులతో సహా వెళ్లి కలిశారు. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో విజేతగా నిలిచి గెల్చుకున్న స్వర్ణ పతకాన్ని మోడీకి చూపించారు.
పీవీ సింధు అద్భుతమైన విజయం సాధించారని .. ఆమె ఆటతీరును ప్రశంసించారు ప్రధాని మోడీ. పతకాన్ని పరిశీలించి మరోసారి ఆమె మెడలో వేశారు. ఈ ఫొటోలను ప్రధానమంత్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
“భారత దేశానికి గర్వకారణమైన ఓ ఛాంపియన్.. మాతృదేశానికి బంగారు పతకాన్ని, ఎంతో కీర్తిని తీసుకొచ్చారు. పీవీ సింధును కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఆమెను అభినందించాను. భవిష్యత్తులో పాల్గొనబోయే పోటీల్లో ప్రతిభ చూపించాలని ఆకాంక్షించాను” అని ప్రధాని ట్వీట్ చేశారు.
India’s pride, a champion who has brought home a Gold and lots of glory!
Happy to have met @Pvsindhu1. Congratulated her and wished her the very best for her future endeavours. pic.twitter.com/4WvwXuAPqr
— Narendra Modi (@narendramodi) August 27, 2019