
హైదరాబాద్, వెలుగు: డిజిటల్ క్వాలిటీ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ సేవల సంస్థల్లో ఒకటైన క్వాలిజీల్ డిజిటల్లో క్యాంపస్ టాలెంట్ పూల్లను డెవలప్ చేయడానికి 'గ్రేస్ హప్పర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (జీహెచ్సీవోఈ) ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ను హైదరాబాదులోని కేఎల్ యూనివర్సిటీ, విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్, మల్లా రెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ (ఎంఆర్ఈసీడబ్ల్యు) క్యాంపస్లలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా క్వాలిజీల్ ఇండియా ఆపరేషన్స్ అడ్వైజర్ మధు మూర్తి మాట్లాడుతూ ప్రతి ఏడాది 200 మంది మహిళా ఇంజనీర్లకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ శిక్షణకు వచ్చే వారికి స్కాలర్షిప్లు, స్టైఫండ్లు ఉంటాయని వెల్లడించారు. సక్సెస్ అయిన గ్రాడ్యుయేట్లకు క్వాలిజీల్ డిజిటల్ క్వాలిటీ ఇంజనీరింగ్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని వివరించారు.