
హైదరాబాద్, వెలుగు: ఈవీ స్టార్టప్ క్వాంటమ్ ఎనర్జీ లిమిటెడ్ ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీకి సమీపంలోని మహేశ్వరం ఫ్యాక్టరీని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా భారీ సంఖ్యలో ఉద్యోగ కల్పన సాధ్యపడుతుందని తెలిపింది. ప్లాంటు వార్షిక సామర్థ్యాన్ని రెండు లక్షల యూనిట్లకు పెంచుతున్నామని, ఇది 2.4 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంటుందని పేర్కొంది.
పర్యావరణ పరిరక్షణ కోసం దీనిని నెట్జీరో క్యాంపస్గా తీర్చిదిద్దామని కంపెనీ సీనియర్ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. ఈ వ్యూహాత్మక విస్తరణ క్వాంటమ్ ఎనర్జీ ఎలక్ట్రిక్ టూవీలర్లకు పెరుగుతున్న డిమాండ్ను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఇందులో ప్లాస్మా, మిలన్, బిజినెస్ వంటి మోడల్స్ఉన్నాయి. భారతీయ రోడ్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దామని కంపెనీ ఎండీ చక్రవర్తి వివరించారు.