కుత్బుల్లాపూర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

 కుత్బుల్లాపూర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

జీడిమెట్ల, వెలుగు: ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలను కుత్బుల్లాపూర్​ రెవెన్యూ అధికారులు గురువారం  కూల్చివేయించారు.  సర్వే నంబర్ 307లో కొందరు భూకబ్జాదారులు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలను చేస్తున్నారు. ఇందులోనే స్టేట్​ఫైనాన్స్​ కార్పొరేషన్​కు కేటాయించిన స్థలాన్ని సైతం కబ్జా చేశారు. గాజులరామారం, దేవేందర్​నగర్, పోచమ్మ బస్తీలో 15 గదులు నిర్మించారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీస్​బందోబస్తు మధ్య వాటిని కూల్చివేయించారు. సర్వే నంబర్ 307లో కబ్జాకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకొని బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్​చేస్తున్నారు.