TSPSC లీక్ : సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలె : ఆర్ కృష్ణయ్య

TSPSC లీక్ :  సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలె : ఆర్ కృష్ణయ్య

 TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై  రాష్ట్ర  ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని  బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్ లోని బీసీ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  25 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుకు విఘాతం కలుగుతున్నా కేసీఆర్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపైన.. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం పైన నిందలు వేసుకుంటున్నాయని అన్నారు. అసలు పేపర్ లీకేజీకి బాధ్యులు ఎవరో తేల్చాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అప్పుడే నిజనిజాలు బయటికి వస్తాయని కృష్ణయ్య తెలిపారు.  

ప్రవీణ్ కు తెలియకుండానే రేణుక పేపర్ డీల్

ఈ కేసులో ఆరెస్ట్ అయిన తొమ్మది మంది నిందుతులను  సిట్ రెండవ రోజు 7 గంటలపాటు విచారించింది.  ఈ విచారణలో నిందితుల నుండి పలు కీలక విషయాలను సిట్ రాబట్టినట్టుగా తెలుస్తోంది. పేపర్ చేతులు మారిన రాజేశ్వర్, రాజేందర్ల నుంచి అధికారులు మరింత సమాచారాన్ని సేకరించారు. పేపర్లు ప్రవీణ్ నుంచి రేణుకకు చేరిన తరువాత రాజేశ్వర్, రాజేందర్ కు ఇచ్చిన అంశంలో రేణుకను ప్రశ్నించింది సిట్., ప్రవీణ్ కు తెలియకుండా ఇతరులకు పేపర్ ను ఇవ్వడానికి రేణుక డీల్ కుదుర్చుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. పేపర్ మరికొంత మందికి  ఇవ్వడానికి రేణుక ప్రయత్నం చేసినట్టుగా దర్యాప్తులో తేలింది. మొత్తం ఎన్ని పేపర్స్ అమ్మకానికి ప్లాన్ చేశారనే  కోణంలో ఇవాళ అధికారులు విచారణ చేశారు.