- మంత్రి జగదీశ్రెడ్డిని బర్తరఫ్ చేయాలి
ముషీరాబాద్,వెలుగు: తొమ్మిది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తున్న వట్టె జానయ్య యాదవ్పై అక్రమ కేసులు పెట్టడం కరెక్ట్కాదని, వెంటనే వాటన్నింటినీ ఎత్తివేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. బీసీ బిడ్డ అయిన సూర్యాపేట డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఒకేరోజు 70 అక్రమ కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సూర్యాపేటలో జరుగుతున్న రాజకీయ అరాచకాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించి ఆ కేసులను వెంటనే ఎత్తివేసి, మంత్రి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వట్టె కృష్ణ యాదవ్, లాల్ కృష్ణ, వేముల రామకృష్ణ, రాజేందర్, మోదీ రాందేవ్ పాల్గొన్నారు.