ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల నియామకాల్లో అమలు చేస్తున్న రోస్టర్ విధానం వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఆదివారం విద్యానగర్ లోని బీసీ భవన్లో సి.రాజేందర్ అధ్యక్షతన వివిధ బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులతో చర్చించిన అనంతరం ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
రోస్టర్ విధానం లోపభూయిష్టంగా, శాస్త్రీయత లేకుండా ఉందని విమర్శిం చారు. ఈ విధానం వల్ల బీసీలకు రావాల్సిన ఉద్యోగావకాశాలు తగ్గి పోతున్నాయన్నారు. బీసీలకు నష్టం జరిగేలా ఉన్న ప్రస్తుత రోస్టర్ను వెంటనే సవరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
