
మెహిదీపట్నం, వెలుగు: విద్యార్థుల ఫీజు రీయింబ్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలిని ముట్టడించి, ధర్నా నిర్వహించారు.
ఈ నిరసనలో వందలాది మంది విద్యార్థులు పాల్గొని రోడ్డుపై బైఠాయించారు. అలాగే, బీఆర్ఎస్వీ నగర ఇన్చార్జి విశాల్, ఆలిండియా డెమొక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్ ఆధ్వర్యంలో వేర్వేరుగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు.
బషీర్బాగ్ : ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం నిజాం కాలేజీ విద్యార్థులు బషీర్ బాగ్ లో ఆందోళనకు దిగారు. ఏబీవీపీ గోల్కొండ జిల్లా కన్వీనర్ విక్రమాదిత్య ఆధ్వర్యంలో నిజాం కళాశాల నుంచి బషీర్ బాగ్ చౌరస్తాలోని డాక్టర్బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు
ర్యాలీ చేపట్టారు.