సాయిరామ్ శంకర్, యషా జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15న సినిమా విడుదల. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. బిగ్ టికెట్ను ఆర్.నారాయణమూర్తి, దర్శకుడు త్రినాథరావు నక్కిన లాంచ్ చేశారు. అనంతరం నారాయణమూర్తి మాట్లాడుతూ ‘డబ్బు పంచి ఓట్లు కొంటూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రాజకీయ నేతలపై ‘వెయ్ దరువెయ్’ అనేలా సినిమా తీశారు.
సమాజంలో చైతన్యం నింపే మంచి మెసేజ్తో సినిమా చేసిన టీమ్కి థాంక్స్’ అన్నారు. దర్శకుడు త్రినాథరావు, నిర్మాత బెక్కెం వేణుగోపాల్, రైటర్ బి.వి.ఎస్.రవి, ఆకాష్ పూరి, సత్యం రాజేష్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ‘కామెడీ, మంచి ఎమోషన్తో ఆలోచింపజేసేలా తీసిన సినిమా ఇది. చూసిన అందరూ ఎంజాయ్ చేస్తారు’ అని సాయి రామ్ శంకర్ అన్నాడు. దర్శకుడు నవీన్ రెడ్డి టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. సాయిరామ్ ఈ మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడని నిర్మాత దేవరాజ్ అన్నారు. మంచి సామాజిక దృక్పథంతో ఎవరూ టచ్ చేయని పాయింట్తో ఈ చిత్రం తీశారని మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ చెప్పాడు. కార్యక్రమంలో టీమ్ అంతా పాల్గొన్నారు.