కోనసీమ జిల్లాకు ఏపీ ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెడుతుంటే దాడులు చేయడం హేయమైన చర్య అని సీనియర్ నటులు ఆర్ నారాయణ మూర్తి. అన్నారు. అభ్యంతరాలు ఉంటే శాంతియుతంగా నిరసనలు తెలపాలి తప్ప... నాయకుల ఇల్లు తగలపెట్టడం, వ్యక్తిగత దాడులు చేయడం కరెక్ట్ కాదన్నారు. అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలని అనుకోవడం శుభ పరిణామం అని..దీన్ని అడ్డుకోవడం తగదన్నారు. అంబేద్కర్ పేరును కేవలం జిల్లాకే కాదు దేశానికి పెట్టాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఇండియాగా మార్చాలన్నారు.
కడపలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి మహాసభల్లో నారాయణమూర్తి పాల్గొన్నారు. కేంద్రం అన్నింటినీ ప్రైవేట్, కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టాలని చూస్తుందని విమర్శించారు. ప్రధాని మోడీ.. తిరుపతి సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ విస్మరించారన్నారు. రాయలసీమ అంటే ఫ్యాక్షన్, హత్యలు, కత్తులు కటారాలు , రౌడీయిజం, కక్ష్యలు, అనేది అవాస్తవమన్నారు. సీమ అంటే ప్రేమ ఆప్యాయతలు నిలయమని...ఇక్కడి ప్రజలు చూపించే ప్రేమ ఆప్యాయత ఎప్పటికీ మరువలేనిదన్నారు.
ఐపీఎల్ ఆడలేదా..ఏం పర్వాలేదు..ఏపీఎల్ ఉందిగా..