కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్దం..

కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్దం..

తెలంగాణలో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 3వ తేదీ ఆదివారం ఎలక్షన్ కమిషన్.. ఎన్నికల ఫలితాల కోసం కౌంటింగ్ నిర్వహించనుంది. సాయంత్రం వరకు మెజార్టీ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈక్రమంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డిసెంబర్ 2వ తేదీ శనివారం ఎలక్షన్ ఆబ్జర్వర్ తోపాటు రాచకొండ సిపి చౌహాన్..  కౌంటింగ్ భద్రత ఏర్పాట్లను  పర్యవేక్షించారు. 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్ పల్లి సీవీఆర్ కాలేజీలో రేపు జరగనున్న  ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి మూడు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కు భద్రత ఏర్పాట్లు ఉన్నత అధికారులు పర్యవేక్షించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి 25రౌండ్లలో ఈవిఏంలను 14 టేబుల్స్,  పోస్టల్ బ్యాలెట్ లను 6టేబుల్స్ గా లెక్కించనున్నారు.