గౌరవం లేని చోట నేనుండను: లారెన్స్

గౌరవం లేని చోట నేనుండను: లారెన్స్

‘లక్ష్మీ బాంబ్’ సినిమానుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ప్రముఖ కొరియో గ్రాఫర్, దర్శకులు రాఘవ లారెన్స్. ఇందుకు గాను తన ట్విటర్ లో రాసుకొచ్చారు. తాను నటించి దర్శకత్వం వహించిన ముని సినిమా సీక్వెల్ కాంచన ను హిందీ లో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా, కియారా అడ్వానీ హీరోయిన్ గా చేయనున్నారు. ఈ సినిమాకు లారెన్స్ దర్శకుడిగా చేయడానికి ఫిక్స్ అయ్యారు. అయితే ఈ రోజు  ‘లక్ష్మీ బాంబ్’ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు లారెన్స్.

ధనం కన్నా, పరపతి కన్నా తనకు ‘సెల్ఫ్ రెస్పెక్ట్’ ముఖ్య మని తెలిపారు లారెెన్స్. గౌరవం ఇవ్వని చోట తాను ఉండనని అన్నారు. ప్రొడక్షన్ కంపెనీ తనతో ప్రవర్తించిన తీరు బాగోలేదని అన్నారు. సినిమా పోస్టర్ ను కూడా.. తన అనుమతి లేకుండా   రిలీజ్ చేశారని అన్నారు. ఆ పోస్టర్ ఢిజైన్ ను కూడా తాను ఫైనల్ చేయలేదని చెప్పారు. ఇలా బిహేవ్ చేసే వారితో తాను పని చేయలేనని చెప్పారు. తనకు అక్షయ్ కుమార్ అంటే గౌరవం ఉందని ఆయన్ని కలిసి జరిగిన విషయం తెలియజేస్తానని అన్నారు. సినిమా కథ తనదేనని… అక్షయ్ మీద ఉన్న అభిమానంతో ఆ కథను వాళ్లకే ఇస్తున్నట్లు చెప్పారు.