బీసీ సీఎం కావాలంటే బీజేపీకి ఓటేయ్యండి : మంద కృష్ణ మాదిగ

బీసీ సీఎం కావాలంటే బీజేపీకి ఓటేయ్యండి : మంద కృష్ణ మాదిగ

దుబ్బాక, వెలుగు : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తున్నట్లు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారని, రాష్ట్ర జనాభాలో 50 శాతం పైగా ఉన్న బీసీలు బీజేపీకి ఓటేయ్యాలని ఎంఆర్​పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపు నిచ్చారు. బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్​రావు ఆధ్వర్యంలో బుధవారం దుబ్బాకలో నిర్వహించిన రోడ్​ షోలో ఆయన ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు.  

రాష్ట్రంలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ మధ్యలో ఎన్నికల యుద్ధం జరుగుతుందన్నారు.  బీసీ సీఎం కావాలంటే బీసీలు, ఎస్సీ వర్గీకరణ కావాలంటే ఎస్సీలు బీజేపీ అభ్యర్థి రఘునందన్​రావును గెలిపించాలని కోరారు.   దుబ్బాకలో రఘునందన్​రావు గెలిస్తే ధర్మం, న్యాయం గెలిచినట్టేనని అన్నారు.  

కేటీఆర్​ , హరీశ్​ దుబ్బాకలో ఎగిరెగిరి పడ్డారు

కేటీఆర్​ మాట్లాడుతున్న భాషను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని,  బూతులు తమ విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. 2020 జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో   హరీష్​రావు  ఎగిరెగిరి పడ్డ విషయం గుర్తు చేసుకోవాలని కేటీఆర్​కు హితవు పలికారు.  దుబ్బాకలోని పోచమ్మ తల్లి చాలా పవర్​ పుల్​ అని, పొట్టోని నెత్తిని పోడువుటోడు కొడితే పోడువుటోని నెత్తిని పోచమ్మ కొట్టుడు ఖాయమన్నారు.