రైతులను ఆదుకునేందుకు రూ.500 కోట్లు సరిపోవ్​: ఎమ్మెల్యే రఘునందన్ రావు

రైతులను ఆదుకునేందుకు రూ.500 కోట్లు సరిపోవ్​: ఎమ్మెల్యే రఘునందన్ రావు

జిన్నారం, వెలుగు:  రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు బీఆర్​ఎస్​ సర్కారు ప్రకటించిన రూ.500 కోట్లు ఏ మూలకు సరిపోవని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. బుధవారం జిన్నారం మండలం కొడకంచిలోని  డెక్కన్ ఆటో కంపెనీలో కార్మిక సంఘం సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం ప్రకటించిన సాయం రోడ్లు పూడ్చడానికి తప్ప రైతాంగానికి సరిపోవని ఎద్దేవా  చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇన్సూరెన్స్ చేయించి ఉంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పరిహారం ఇయ్యాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. ఇప్పటికైనా ఇన్సూరెన్స్ చేయించాలని డిమాండ్​ చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, మండల నాయకులు ఉన్నారు.