ఈ విజయం చారిత్రాత్మకం

ఈ విజయం చారిత్రాత్మకం

సిద్దిపేట జిల్లా : దుబ్బాక విజయం ఎంతో చారిత్రాత్మకమైనదన్నారు బీజేపీ విజేత రఘునందన్‌రావు. తనకు విజయాన్ని అందించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విజయం నియోజకవర్గ ప్రజలకు అంకితమన్నారు. ఫలితాల తర్వాత సిద్దిపేటలో మాట్లాడిన రఘునందన్‌ .. ఈ ఎన్నికల్లో తన గెలుపును అడ్డుకోవాడానికి టీఆర్‌ఎస్‌ నేతలు అన్ని విధాల ప్రయత్నించారని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, అసెంబ్లీ వేదికగా వారి తీరును ఎండగడతానని అన్నారు. తన గెలుపును దుబ్బాకతో పాటు, రాష్ట్ర ప్రజలకు అంకితమిస్తున్నట్టు చెప్పారు. స్థానిక సమస్యలతో పాటు.. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజల సమస్యలు తీరుస్తానన్నారు. అక్రమ కేసులు, నిర్బంధాలను తట్టుకుంటూ పోరాటం సాగిస్తామన్నారు రఘునందన్‌.