తిరిగి బీఆర్ఎస్​ గూటికి చేరిన సర్పంచులు

తిరిగి బీఆర్ఎస్​ గూటికి చేరిన సర్పంచులు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం నియోజకవర్గంలోని ఏకైక మండలమైన రఘునాథపాలెంలో ముగ్గురు సర్పంచులు తరిగి బీఆర్ఎస్​ గూటికి చేరారు. సోమవారం సాయంత్రం మాజీ ఎంపీ పొంగులేటి క్యాంప్​ కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్​ లో చేరారు. వీరు మళ్లీ మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్​ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

రఘునాథపాలెం మండల బీఆర్ఎస్​ అధ్యక్షుడు వీరునాయక్ ఆధ్వర్యంలో ఎన్ వీ బంజర సర్పంచ్ సక్రాం నాయక్, రజబ్​ అలీ నగర్ సర్పంచ్ బోడ శరత్, మంగ్యాతండా సర్పంచ్ జీజా మత్రు, రజబ్​ అలీ నగర్ ఉప సర్పంచ్ దంగుల నరసింహారావు, బొడ చిన్న బీఆర్ఎస్​ లో చేరిన వారిలో ఉన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ నాయకత్వంలోనే పని చేస్తామని వారు తెలిపారు.