రాహుల్ భారత్ జోడోయాత్రలో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్

రాహుల్ భారత్ జోడోయాత్రలో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు రాజస్థాన్ లో అనూహ్య స్పందన వస్తోంది. రాహుల్ వెంట నడిచేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పోటీ పడుతున్నారు. చలిని లెక్కచేయకుండా రాహుల్ అడుగులో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇవాళ ఉదయం రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ నుంచి ప్రారంభమైన రాహుల్ పాదయాత్రలో రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. వీరిద్దరూ కొద్దిదూరం నడుచుకుంటూ  ఒకరినొకరు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్న వీడియోను  సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున కశ్మీర్ లో భారత్ జోడో యాత్ర ముగియనున్నంది. ఈ యాత్రలో వివిధ రంగాలకు చెందిన పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన జోడో యాత్ర ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సాగింది.