శ్రీలంక వెళ్లే టీమిండియాకు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్

శ్రీలంక వెళ్లే టీమిండియాకు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్

శ్రీలంక పర్యటనకు వెళ్లే శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరించనున్నట్లు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI) ప్రకటించింది. BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాలు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. జులైలో శ్రీలంకతో జరగనున్న లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్ లకు ఇటీవలే టీమ్ ను కూడా బీసీసీఐ ఎంపిక చేసింది. 

జులై 13 నుంచి శ్రీలంకతో జరిగే మూడు వన్డేలు, మూడు T20ల కోసం ఈ నెల 28న టీమిండియా ఆటగాళ్లు కొలంబో వెళ్లనున్నారు. అక్కడ జులై 4 వరకు మరోసారి క్వారంటైన్ కానున్నారు. ఆ తర్వాత ఆటగాళ్లంతా రెండు వేర్వేరు జట్లుగా ఏర్పడి ప్రాక్టీసు మ్యాచ్ లు ఆడుతారు. జులై 13, 16, 18న వన్డే మ్యాచ్ లు, 21, 23, 25వ తేదీల్లో T20 మ్యాచ్ లు జరుగనున్నాయి.