- రాహుల్ గాంధీ ఆరోపణలు
న్యూఢిల్లీ: దేశ రక్షణ, ఇంధన భద్రత, సార్వభౌమాధికారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు అప్పగిస్తున్నాని.. దీనిపై ప్రజలు ప్రశ్నించొద్దనే హిందూ-ముస్లిం ఘర్షణలు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో అల్లర్ల వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని, దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
ఈ నెల 4న హోలీ వేడుకల సమయంలో వాటర్ బెలూన్ పొరుగువారిపై పడటంతో రెండు వర్గాల మధ్య గొడవ మొదలై, చివరకు తరుణ్ కుమార్(26) హత్యకు దారితీసింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గురువారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
