అహ్మదాబాద్: క్రిమినల్ డిఫమేషన్ కేసు విచారణలో భాగంగా జులై 12న స్వయంగా హాజరుకావాలంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్గాంధీకి అహ్మదాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. అహ్మదాబాద్ డిస్ట్రిక్ట్కో ఆపరేటివ్బ్యాంక్చైర్మన్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో భాగంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
నోట్ల రద్దు తర్వాత 745.59 కోట్ల విలువైన పాతనోట్లను మార్చడంలో కో ఆపరేటివ్బ్యాంక్హస్తం ఉందంటూ రాహుల్గాంధీ గతంలో ఆరోపించారు. పార్టీ అధికార ప్రతినిధి రణదీప్సుర్జేవాల కూడా ఇవే ఆరోపణలు చేశారు. దీనిపై బ్యాంక్ తో పాటు చైర్మన్కూడా కోర్టు కెక్కారు. రాహుల్, సూర్జేవాలాపై పరువునష్టం దావా దాఖలు వేశారు.
విచారణలో భాగంగా స్వయంగా హాజరుకావాలంటూ కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న రాహుల్విచారణకు హాజరు కావాల్సింది. అయితే, తన క్లైంట్కు మరికొంత సమయం కావాలంటూ రాహుల్ తరపు లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కోర్టు గడువు మంజూరు చేశారు. జులై 12న రాహుల్తో పాటు సుర్జేవాలా కూడా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.