బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్

 బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్

బిర్సా ముండా సిద్దాంతంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గిరిజనుల పేరును ఆదివాసీ నుంచి వనవాసీగా మార్చటం వెనుక బీజేపీ కుట్ర ఉందన్నారు. ఆదివాసీల హక్కులను బీజేపీ లాక్కుంటుందన్నారు మండిపడ్డారు. మహారాష్ట్రలోని హింగోలిలో భారత్ జోడోయాత్రలో రాహుల్ మాట్లాడారు.

కాగా, కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడి వశీమ్‌ నగరంలో నిర్వహించిన బిర్సా ముండా జయంతి వేడుకకు రాహుల్‌ గాంధీ హాజరయ్యారు. ఆదివాసీలు వినియోగించే ధనస్సుతో బాణాన్ని వదిలి పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపారు.