మధు యాష్కీకి రాహుల్ పరామర్శ.. తల్లి మృతిపై ఫోన్ లో సంతాపం

మధు యాష్కీకి రాహుల్ పరామర్శ.. తల్లి మృతిపై ఫోన్ లో సంతాపం

హైదరాబాద్, వెలుగు: మధు యాష్కీ గౌడ్ తల్లి అనసూయమ్మ మరణంపై ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం మధు యాష్కీకి  ఫోన్ చేసి పరామర్శించారు. అనసూయమ్మ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ మధు యాష్కీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మధు యాష్కీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

 ఫోన్ లో పరామర్శించిన సీఎం

కేరళలోని వయనాడ్ పర్యటనకు వెళ్తున్నందున స్వయంగా వచ్చి పరామర్శించలేకపోతున్నానని మధు యాష్కీ కి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం మధు యాష్కీకి ఆయన ఫోన్ చేశారు. కేరళ నుంచి వచ్చాక  కలుస్తానని యాష్కీకి సీఎం  హామీ ఇచ్చారు.