యూపీలో హత్యకు గురైన దళితుడు కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఆ కుటుంబం ఏ నేరం చేయకపోయినా.. బతికున్నోళ్లను బెదిరిస్తున్నారు.. నన్ను కలుద్దామని ప్రయత్నించిన బాధిత కుటుంబాన్ని యుపి ప్రభుత్వం బెదిరిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఇటీవల రాయ్బరేలిలో హత్యకు గురైన దళిత వ్యక్తి హరిఓం వాల్మీకి కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం(అక్టోబర్17) కలిశారు. ఆ కుటుంబం ఆ నేరం చేయలేదు.. వారిపై నేరం మోపారు. వారిని నేరస్థులుగా చూస్తున్నారు. నన్ను కలవవద్దని అధికారులు ఆదేశించారని ఆ కుటుంబం చెబుతోందన్నారు. దేశవ్యాప్తంగా దళితులపై దారుణాలు, హత్యలు ,అత్యాచారాలు జరుగుతున్నాయి.. వారికి న్యాయం జరగాలని నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. వారిని గౌరవించాలి. నేరస్థులపై చర్యలు తీసుకోవాలని కోరారు రాహుల్ గాంధీ.
మరోవైపు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా దళితుడి హత్యను ఖండించారు. దేశవ్యాప్తంగా న్యాయం కోసం జరిగే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు.
అంతకుముందు రోజు వాల్మీకి కుటుంబం రాహుల్ గాంధీని కలవడానికి నిరాకరించిన వీడియో వైరల్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం బాదిత కుటుంబానికి సాయం చేసింది. ఈ కేసులో ప్రభుత్వం తీరు మాకు సంతృప్తినిచ్చిందిన వాల్మీకి సోదరుడు వీడియోలో మాట్లాడారు.. అయితే స్వయంగా ఇవాళ రాహుల్ గాంధీ బాధిత కుటుంబాన్ని కలిశారు. ఆ సమయంలో ప్రభుత్వ అధికారులు రాహుల్ కలవొద్దని బెదిరించారని బాధిత కుటుంబం తెలిపింది.
అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్కు చెందిన హరిఓం వాల్మీకి అనే దళితుడిని రాయ్బరేలిలోని జమునాపూర్ సమీపంలో దొంగ అనుకొని కొట్టి చంపారు.
