ఢిల్లీ: ఈ నెల 14 నుంచి రాహుల్గాంధీ న్యాయ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు జనవరి 11వ తేదీ గురువారం ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శమా అహ్మద్ ప్రకటించారు. రాహుల్ యాత్ర మణిపూర్ లో ప్రారంభమై.. మార్చి 20వ తేదీన ముంబయ్ లో ముగియనుంది. దేశంలోని 14 రాష్ట్రాల మీదుగా మొత్తం 6,200 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర కొనసాగనుంది.
గతేడాది సెప్టెంబర్ లో రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపు 12 రాష్ట్రాల మీదుగా 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగింది.