ఇవాళ 27 కిలోమీటర్లు సాగనున్న రాహుల్ యాత్ర

ఇవాళ 27 కిలోమీటర్లు సాగనున్న రాహుల్ యాత్ర

నారాయణపేట : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. మూడు రోజుల విరామం అనంతరం మక్తల్ నుంచి భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నారు. అర్థరాత్రి గుడెబల్లూరుకు చేరుకున్న రాహుల్.. ఇవాళ మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించనున్నారు. 167వ నెంబర్ రహదారిపై 27 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. గునుముకుల క్రాస్ రోడ్ వద్ద రాహుల్ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. మరికల్ మండలం ఎలిగండ్ల వద్ద రాత్రికి బస చేయనున్నారు. 

ఈ నెల 23న రాయచూర్ నుంచి రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. అయితే ఒక్కరోజు యాత్ర చేసిన రాహుల్ గాంధీ మూడు రోజుల విరామం ప్రకటించారు. దీపావళి, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన తిరిగి యాత్ర మొదలుపెట్టారు.