
లోక్సభ ఎంపీగా అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తుగ్లక్ లేన్-12లో తన అధికార నివాసాన్ని త్వరలోనే ఖాళీ చేయనున్నారు. జన్పథ్లోని తన తల్లి సోనియాగాంధీ ఇంటికి రాహుల్ షిప్ట్ కానున్నారు. నివాసాన్ని ఖాళీ చేయడానికి ముందు రాహుల్ తన సామాన్లను రెండు ట్రక్ ల్లో అక్కడికి షిప్ట్ చేశారు.
https://twitter.com/ANI/status/1646845601441783810
నాలుగేళ్ల కింద కర్ణాటక కోలార్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ‘మోదీ ఇంటిపేరు’ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సూరత్ కోర్టు .. రాహుల్ కు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది.
ఈ క్రమంలో ఎంపీగా రాహుల్ పై అనర్హత వేటు పడింది. దీంతో ఏప్రిల్ 22లోగా రాహుల్ తన అధికార నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్సభ సెక్రటేరియట్ ఆయనకు మార్చి 27న నోటీసులు పంపింది. రాహుల్ లోక్సభకు వరుసగా నాలుగోసారి ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో రాహుల్ గాంధీ తొలిసారిగా అమెథీ నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనకు ఢిల్లీలోని తుగ్లక్ లేన్లో బంగ్లాను కేటాయించారు. నాటి నుంచి ఆయన అక్కడే నివాసం ఉంటున్నారు.