
తోడు దొంగల్లా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు
బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఇతర దేశాల్లో మన దేశాన్ని చులకన చేసి మాట్లాడి దేశ ప్రతిష్టను భంగపరిచిన రాహుల్గాంధీ ఏం మొఖం పెట్టుకుని ఖమ్మం వస్తున్నారని బీజేపీ జాతీయ నాయకుడు, తమిళనాడు రాష్ర్ట సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఖమ్మం పార్టీ ఆఫీస్లో ఆయన మాట్లాడుతూ రాహుల్గాంధీ దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పిన తరువాతే ఖమ్మం గడ్డపై అడుగుపెట్టాలన్నారు.
ఖమ్మంలో జరగనున్న కాంగ్రెస్సభ కొందరి నాయకుల ధన గర్జన సభగా మారిందన్నారు. రాష్ర్టంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడుదొంగల్లా నాటకాలు ఆడుతున్నాయన్నారు. జులై 8న హన్మకొండలో నిర్వహించనున్న మోడీ బహిరంగసభకు పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, రుద్ర ప్రదీప్, కడగంచి రమేశ్, మందా సరస్వతి పాల్గొన్నారు.