హైదారాబాద్లో వర్షం..పలు చోట్ల ట్రాఫిక్ జామ్

హైదారాబాద్లో  వర్షం..పలు చోట్ల ట్రాఫిక్ జామ్

హైదారాబాద్ లో పలు చోట్ల వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్,పంజాగుట్ట,అమీర్ పేట్,ఎస్సార్ నగర్, ఎర్రగడ్డ,కూకల్ పల్లి, లింగంపల్లి, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, యూసఫ్ గూడ్, ఖైరతాబాద్, సికింద్రాబాద్,అల్వాల్, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్,ఎల్బీ నగర్,బాల్ నగర్, చింతల్, బాలనగర్, పటాన్ చెరు, రామచంద్రపురం,అమీన్ పూర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.

 కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. ఉద్యోగులు ఆఫీసుల నుంచి  ఇంటికెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

ALSO READ | వానాకాలం వచ్చేసింది.. ఎండా కాలం అయిపోయింది : రోహిణి కార్తెలోనే నైరుతి రుతు పవనాలు

వారం ముందుగానే ఏపీని టచ్ చేసిన నైరుతి పవనాలు 13 రోజుల ముందే తెలంగాణలోకి ఎంట్రీ అయిపోయాయి.  ఉపరితల ద్రోణి, నైరుతి రుతు పవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఇవ్వగా.. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. 

నైరుతి రుతు పవనాలకు మరింత బలాన్ని ఇస్తూ.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతున్నది. ఈ అల్పపీడనం బలపడితే.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడనున్నాయి. రోహిణి కార్తె జూన్ 8వ తేదీ వరకు ఉండగా.. రోహిణి కార్తె ప్రారంభం రోజునే తెలంగాణలోకి నైరుతి రుతు పవనాలు రావటం అనేది విశేషం.