
రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. కొన్ని గంటల్లో ఉపరితల ద్రోణి అల్పపీడనంగా బలపడనుందని తెలిపింది వాతావరణ శాఖ. వచ్చే రెండ్రోజుల్లో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వానలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.