జోరందుకున్న వరినాట్లు

జోరందుకున్న వరినాట్లు

మెదక్​టౌన్, వెలుగు: రెండుమూడు రోజులుగా వానలు పడుతుండడంతో మెదక్, హవేళీఘనపూర్​మండలాల్లో వరినాట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం కూలీల కొరత లేకుండా ముందుగానే బిహార్, యూపీ, ఛత్తీస్​గఢ్​ తదితర రాష్ట్రాల నుంచి కూలీలను సైతం పిలిపించుకొని నాట్లు వేయిస్తున్నారు. 

ఎకరానికి కొంత గుత్తగా మాట్లాడుకుని నాట్లు వేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే వరినాట్లు చివరి దశకు చేరుకోనున్నాయి.