రాష్ట్రంలో పలు చోట్ల వర్షం

రాష్ట్రంలో పలు చోట్ల వర్షం

రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, జగిత్యాల జిల్లాల్లో పలుచోట్ల వానలు పడ్డాయి. అకాల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. పలుచోట్ల ధాన్యం తడవడంతో పాటు మామిడికాయలు రాలిపోయాయి. 

హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వాన పడింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, బేగం బజార్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్ బాగ్, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మెదహీపట్ల, లంగర్ హౌస్, కార్వాన్, గోల్కొండ ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులు వీయడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఎండల కారణంగా ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు వర్షంతో కాస్త ఉపశమనం లభించింది.