అభివృద్ధితో చరిత్ర సృష్టించినం : అశోక్ గెహ్లాట్

అభివృద్ధితో  చరిత్ర సృష్టించినం : అశోక్ గెహ్లాట్

జైపూర్: రాష్ట్రంలో అభివృద్ధితో చరిత్ర సృష్టించామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. రోడ్లు, మౌలిక వసతులు, హెల్త్, సోషల్ సెక్యూరిటీ, ట్రైబల్ వెల్ఫేర్ తదితర రంగాల్లో అనూహ్య విజయాలు సాధించామని చెప్పారు. ఆదివారం ప్రతాప్ గఢ్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో గెహ్లాట్ మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో గత 70 ఏండ్లలో 250 కాలేజీలు ఏర్పాటు చేస్తే.. మేం అధికారంలోకి వచ్చినంక నాలుగున్నరేండ్లలోనే 300 ఏర్పాటు చేశాం. 

గర్ల్స్ ఎడ్యుకేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాం. ఒక్క ప్రతాప్ గఢ్ లోనే ఏడు కాలేజీలు ఏర్పాటు చేశాం. జిల్లా ఆస్పత్రిలో బెడ్ల సంఖ్యను 100 నుంచి 300కు పెంచినం” అని ఆయన తెలిపారు. అనంతరం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.