
పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓపెన్ ఛాలెంజ్ చేశారు మంత్రి కిరోదిలాల్ మీనా.. నా నియోజకవర్గాల పరిధిలో.. నేను చెప్పిన నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోతే.. కాంగ్రెస్ గెలిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు. ఏ ముహూర్తాన సవాల్ చేశారో ఏమో.. ఆయన ఛాలెంజ్ చేసిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోయింది.. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రాజకీయాల్లో ఇవన్నీ కామనే అని దాదాపు అందరూ లైట్ తీసుకుంటారు.. ఈ బీజేపీ మంత్రి మాత్రం అలా తీసుకోలేకపోయారు... చెప్పినట్లు.. ఛాలెంజ్ చేసినట్లు.. సవాల్ విసిరినదానికి కట్టుబడి.. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
లోక్సభ ఎన్నికల సమయంలో కిరోదిలాల్ మీనా తూర్పు రాజస్థాన్లోని 7 స్థానాలకు ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. ఇందులో ఏ ఒక్క స్థానంలోనైనా బీజేపీ ఓడిపోతే తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. అయితే దౌసా స్థానంలో కూడా బీజేపీ ఓడిపోయింది. ఈ ఏడు స్థానాల్లో దౌసా, కరౌలి-ధోల్పూర్, టోంక్-సవాయి మాధోపూర్, భరత్పూర్ స్థానాలతో కూడిన 4 స్థానాలను బీజేపీ కోల్పోయింది.దీంతో మీనా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ విషయాన్ని మీనా స్వయంగా ఓ టీవీ ఛానెల్ ద్వారా వెల్లడించారు
Also Read:మంచిదొంగ.. నెల రోజుల్లో తిరిగి ఇస్తానని దొంగతనం
ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ విషయాన్ని మీనా స్వయంగా ఓ టీవీ ఛానెల్ ద్వారా వెల్లడించారుసీఎం భజన్ లాల్ శర్మ తనను రాజీనామా చేయవద్దని కోరారని, అయితే తాను అన్ని పదవులకు రాజీనామా చేశానని అన్నారు. . నిజానికి, 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆయన రాజీనామాపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాగా రాజస్థాన్ ప్రభుత్వంలో వ్యవసాయ, గ్రామీణ మంత్రిగా కిరోదిలాల్ మీనా ఉన్నారు.