రాజస్తాన్ రాయల్స్ జోరు

రాజస్తాన్ రాయల్స్ జోరు
  • ప్లేఆఫ్స్ రేసులో ముందుకు  

ముంబై: కీలక మ్యాచ్ లో రాజస్తాన్​ రాయల్స్ దుమ్మురేపింది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో 24 రన్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ ను చిత్తుచేసి లీగ్ లో ఎనిమిదో విక్టరీతో  రెండో ప్లేస్‌‌‌‌కు చేరుకుని ప్లేఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకేసింది. టాస్‌‌ గెలిచి మొదట బ్యాటింగ్‌‌కు వచ్చిన రాజస్తాన్ 20 ఓవర్లలో 178/6 స్కోరు చేసింది. యశస్వి జైస్వాల్ (29 బాల్స్ లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 41), దేవదత్‌‌ పడిక్కల్ (18 బాల్స్ లో 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 39) సత్తాచాటారు. లక్నో బౌలర్లలో రవి బిష్నోయ్ (2/31) రెండు వికెట్లు పడగొట్టగా..  జేసన్‌‌ హోల్డర్ (1/12), అవేశ్ ఖాన్‌‌(1/20), ఆయుష్‌‌ బదోని (1/5) తలో వికెట్‌‌ తీశారు. అనంతరం ఛేజింగ్ లో ఓవర్లన్నీ ఆడిన లక్నో 154/8 స్కోరు మాత్రమే చేసి ఓడింది. దీపక్ హుడా (39 బాల్స్ లో 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 59) హాఫ్ సెంచరీ సాధించాడు. అతనితో పాటు  క్రునాల్ పాండ్యా (25), మార్కస్‌‌ స్టోయినిస్ (27)  పోరాడినా ఫలితం లేకపోయింది.  రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్‌‌ బౌల్ట్ (2/18), ప్రసిధ్ కృష్ణ (2/32), మెకే (2/35) రెండు వికెట్లు తీసి టీమ్‌‌ను గెలిపించారు.  బౌల్ట్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.