రాణించిన రాజస్థాన్ బౌలర్లు..చేతులెత్తేసిన హైదరాబాద్ ప్లేయర్లు

రాణించిన రాజస్థాన్ బౌలర్లు..చేతులెత్తేసిన హైదరాబాద్ ప్లేయర్లు

జైపూర్: రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ తడబడింది. తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన SRH నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 160 రన్స్ చేయగలిగింది. ప్రారంభంలో దూకుడుగా కనిపించిన హైదరాబాద్..కెప్టెన్ విలియమ్సన్ ఔట్ అవ్వడంతో స్కోర్ తగ్గింది. ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే హాఫ్ సెంచరీతో సూపర్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. మిగతా ప్లేయర్లు రాణించలేదు. రాజస్థాన్ కట్టుదిట్టమైన బౌలింగ్ కు బౌండరీలు కొట్టేందుకు నానా కష్టాలు పడ్డారు SRH బ్యాట్స్ మన్లు. చివర్లో వచ్చిన రషీద్ ఖాన్ ఫొర్, సిక్స్ కొట్టడంతో హైదరాబాద్ గౌరవప్రధమైన స్కోర్ చేసింది.

హైదరాబాద్ ప్లేయర్లలో..విలియమ్సన్(13), వార్నర్(37), మనీష్ పాండే(61), విజయ్ శంకర్ (8), దీపక్ హుడా(0 డకౌట్), షకీబ్(9), సాహ(5), భువీ(1), రషీద్( 17-నాటౌట్), సిద్దార్థ్ కౌల్(0 నాటౌట్) రన్స్ చేశారు.

రాజస్థాన్ బౌలర్లలో..ఉనద్కత్, శ్రేయాస్ గోపాల్, థోమస్, వరుణ్ ఆరోన్ తలో రెండు వికెట్లు తీశారు.