కూతురి డైరెక్షన్‌‌లో..ఫ్యాంటసీ స్టోరీతో

కూతురి డైరెక్షన్‌‌లో..ఫ్యాంటసీ స్టోరీతో

రజినీకాంత్ హీరోగా ‘అన్నాత్తే’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ దీపావళికి రిలీజ్​ కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన రజినీ హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లారు. ఈ సినిమా దాదాపుగా కంప్లీటవడంతో ఆయన తన నెక్స్ట్ మూవీని ఎవరితో 
చేయబోతున్నారనే విషయంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు దర్శకులు ఆయనకి కథలు చెప్పినట్టు టాక్. వారిలో రజినీకాంత్ కూతురు సౌందర్య కూడా ఉన్నారట. అంతేకాదు, ఆయన తన నెక్స్ట్ మూవీని కూతురు డైరెక్షన్‌‌లోనే చేయబోతున్నారని కోలీవుడ్ సమాచారం. సౌందర్యకి డైరెక్షన్ కొత్తేమీ కాదు. గతంలో రజినీకాంత్ ప్రధాన పాత్రలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ‘కొచ్చాడయాన్’ అనే యానిమేషన్ మూవీ చేశారామె. కానీ ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది. నాలుగేళ్ల క్రితం ధనుష్ తో ‘విఐపీ 2’ తీసి మెప్పించిన సౌందర్య, ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్’ వెబ్ సిరీస్‌‌కి క్రియేటివ్ డైరెక్టర్‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు. తండ్రితో సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న సౌందర్య.. కొందరు ప్రముఖ రచయితలతో కలిసి ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఫ్యాంటసీ స్టోరీతో భారీ బడ్జెట్‌‌లో తెరకెక్కే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆసక్తి చూపిస్తోందట. రజినీ అమెరికా నుండి తిరిగి రాగానే ఈ ప్రాజెక్ట్‌‌పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.